కేటీకీ 6వ గనిలో ప్రమాదం
భూపాలపల్లి, ఏప్రిల్ 7: భూపాలపల్లిలోని సింగరేణి కేటీకే ఆరవ భూగర్భ గనిలో బుధవారం గని పైకప్పు కూలి బండ కింద చిక్కుకుని ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గనిలో బుధవారం రెండో షిప్టులో సపోర్ట్మెన్ కార్మికులు క్యాతం నర్సయ్య, సలవేని శంకరయ్య, దేసి మల్లయ్య రూఫ్ సపోర్టింగ్ పనులు చేస్తుండగా సాయంత్రం 6.20 గంటల సమయంలో ఒక్కసారిగా గని పైకప్పు కూలింది. మల్లయ్య బండ కూలిన చోటుకు కొంత దూరంలో ఉండడంతో పరిగెత్తి బయ టపడ్డాడు. నర్సయ్య, శంకరయ్య బండ కిందే చిక్కుకున్నారు. మల్ల య్య ప్రమాద సమాచారాన్ని పైనున్న అధికారులకు తెలియజేశారు. రాత్రి 11 గంటల వరకు రెస్క్యూ బృందం శ్రమించినా ఫలితం దక్కలేదు. నర్సయ్య, శంకరయ్య మృతదేహాలను వెలికితీసి సింగరేణి ఏరియా దవాఖానకు తరలించారు. నర్సయ్య స్వగ్రామం పెద్దపల్లి జిల్లాలోని గౌరెడ్డిపేట. ఆయనకు భార్య భూలక్ష్మి, నలుగురు కుమా రులు ఉన్నారు. శంకరయ్య స్వగ్రామం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావుపేట. ఇతనికి భార్య రామక్క, నలుగురు కు మారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాలను బయటకు తీసుకువచ్చిన తరువాత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని గని వద్ద తోటి కార్మికులు, సంఘాల నాయకులు ఆందోళనకు దిగా రు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా, తోటి కార్మికులు కన్నీటి పర్యంతమ య్యారు. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమ ణారెడ్డి, జీఎం నిరీక్ష ణ్రాజ్, ఎస్ఓటు జీఎం విజయప్రసా ద్, పర్సనల్ మేనేజ ర్ అనిల్కుమార్, పోలీసులు గని వద్ద పరిస్థితిని సమీక్షిం చారు. మృతి చెంది న కార్మికుల కుటుం బాలకు అండగా ఉంటామని ఎమ్మె ల్యే హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
ముంబై మాజీ పోలీస్ బాస్ పరంబిర్ సింగ్ను ప్రశ్నించిన ఎన్ఐఏ
కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు.. తగ్గని కరోనా కేసులు