హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలం గాణ): కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం విధిం చిన లాక్డౌన్ కలిసివచ్చింది. సెకండ్వేవ్ను సమర్థంగా నియంత్రించడంలో కీలకపాత్ర పోషించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నుంచి కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. మే మొదటివారం తర్వాత పతాకస్థాయికి చేరా యి. 2 వారాలు కొనసాగి ఆ తర్వాత తగ్గు ముఖం పట్టింది. లాక్డౌన్ విధించిన నెల రోజుల్లోనే 70శాతం కేసులు తగ్గిపోయాయి. లాక్డౌన్ను కఠినంగా అమలుచేయటంతో ప్రజలు బయట ఎక్కువగా తిరుగకపోవడం వల్ల వైరస్వ్యాప్తి తగ్గింది. దవాఖానల్లో బెడ్ ఆక్యుపెన్సీ నిష్పత్తి ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. మార్చి మొదటి వారంలో 7 శాతం పడకలు నిండగా, మే రెండోవారానికి 53 శాతం పడకలు రోగులతో నిండాయి. ప్రస్తుతం 16 శాతానికి తగ్గాయి.
99.4 శాతం మంది ఇంటికి
రాష్ట్రంలో కరోనా సోకినవారిలో 99.40 శాతం మంది కోలుకుంటున్నారు. గతేడాది మార్చి 2 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,03,369 మందికి కరోనా సోకింది. ఇం దులో ఇప్పటివరకు 5,82,232 మందికి చికిత్స పూర్తవగా, 5,78,748 మంది డిశ్చా ర్జి అయ్యారు. 3,484 మంది మరణించారు. సుమారు 99.40 శాతం మంది కోలుకొని ఇంటికి వెళ్లినట్టు గణాంకాలు చెప్తున్నాయి. అదేసమయంలో జాతీయ సగటు రికవరీ రేటు 98.68 శాతంగా, మరణాల రేటు 1.32 శాతంగా ఉన్నది. కల్లోలం సృష్టించిన సెకండ్ వేవ్ సమయంలోనూ రాష్ట్రంలో 99.35 శాతం రికవరీ రేటు నమోదు కావ డం విశేషం. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఇప్పటివరకు 3.04 లక్షల మంది కరోనా బారినపడ్డారు. 2,85,211 మందికి చికిత్స పూర్తవగా, 2,83,361 మంది ఇంటికి వెళ్లా రు. కేవలం 1,850 మంది (0.65%) మరణించారు. 21,137 మంది చికిత్స పొందా రు. పాజిటివిటీ రేటులోనూ జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణలో సగమే నమోదైంది. జాతీయ సగటు 7.77 శాతంగా ఉండగా, తెలంగాణలో 3.60 శాతం నమోదైంది. మొదటివేవ్తో పోల్చితే సెకండ్వేవ్లో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కాస్త ఎక్కువగా 3.8 శాతంగా నమోదైంది.
ప్రతి 10 లక్షల జనాభాకు టెస్టులు
జాతీయ సగటు – 2,84,811
తెలంగాణ సగటు – 4,49,325
నెల రోజుల లాక్డౌన్ ఫలితాలు
రోజువారీ కేసుల్లో తగ్గుదల – 72%
పాజివిటీ రేటులో తగ్గుదల – 80%
బెడ్ ఆక్యుపెన్సీలో తగ్గుదల – 65%
రికవరీ రేటులో పెరుగుదల – 5.44%
నిరంతరంగా ఫీవర్ సర్వే
రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు చేపట్టిన జ్వరసర్వే నిరంతరాయంగా కొనసాగుతున్నది. మొదటి దశ సర్వే పూర్తి చేయగా రెండో దశ సర్వే 95 శాతానికి పైగా జరిగింది. ప్రస్తుతం మూడు, నాలుగో దశ ఫీవర్ సర్వే కొనసాగుతున్నది.