హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో అనుమతించిన కార్యాకలాపాలు నిర్వహించడానికి సంబంధించిన వ్యక్తులకు, వాహనాలకు, ఉద్యోగులకు ఆయా శాఖల అధిపతులు పాస్లు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం తెలిపింది. ప్రధాన కార్యాలయాల్లో శాఖాధిపతులు, జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, సాధారణ పరిపాలనశాఖ పాస్లు ఇస్తుందని వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చే పాస్లను పోలీసులు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.