వరంగల్ అర్బన్ : ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలుచేస్తున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాక్ డౌన్ విజయవంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పకడ్బందీగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.
ఉదయం 6.00 గంటల నుంచి10.00 గంటల వరకు నాలుగు గంటల పాటు లాక్ డౌన్ సడలింపు ఉండగా, ఉదయం 8.00 గంటల పిదప ఒక్కసారిగా నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలుకై బయటకు వస్తున్నారని, దీంతో జనసమూహం పెరుగుతున్నదని ఆయన అన్నారు.
ఇంటినుండి ఒక్కరే వెళ్లాలని, వారం రోజులకు సరిపడా సరుకులను ఒకేసారి తెచ్చుకోవాలని ఆయన కోరారు. లాక్ డౌన్ విధించడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నప్పటికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలుచేస్తున్నామని ఆయన తెలిపారు.
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లేనట్లయితే మార్కెట్లలో బజారులలో రద్దీ పెరిగి కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని మంత్రి అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళినప్పుడు తప్పక మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలి, తరచూ శానిటైజర్ తో చేతులను శుభ్ర పరుచుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
మండపంలో పెండ్లి కూతురు.. పోలీసు వాహనంలో తల్లిదండ్రులు
పోలీసులమని బెదిరించి.. బంగారం దోచుకెళ్లిన దుండగులు
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
బాధ్యతగా పని చేయండి : మంత్రి హరీశ్ రావు
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయం