ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 14 : బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు తెలియజేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్ అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి సాధించినప్పుడే సమానత్వం వస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, కృష్ణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, ఎంపీపీ కృపేశ్, వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు రాజు, విజయ్, శేఖర్గౌడ్ పాల్గొన్నారు.
క్రీడా సామగ్రి పంపిణీ..
ఇబ్రహీంపట్నం 8వ వార్డులో వైస్చైర్మన్ యాదగిరి యువతకు క్యారం బోర్డులు, వాలీబాల్, క్రికెట్ కిట్స్, షటిల్ బ్యాట్లు, స్కిపింగ్ రోప్స్ అందజేశారు.
అంబేద్కర్ ఆదర్శనీయుడు..
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శనీయుడని, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. పట్టణంలో ఉపాధ్యాయుడు ప్రసాద్ కుమారులు సాయినివాస్, సాయిసాకేత్ అంబేద్కర్ వేషధారణలో ఆకట్టుకున్నారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ అనిత, కమ్లీమోత్యానాయక్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, వైస్ఎంపీపీ అనంతరెడ్డి పాల్గొన్నారు.
మాడ్గులలో..
మండల కేంద్రంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. బ్రాహ్మణపల్లి, గిరికొత్తపల్లి, నాగిళ్ల, ఆవురుపల్లి, నల్లచెరువు, ఇర్విన్, కొలుకులపల్లి గ్రామాల్లో జయంతి నిర్వహించారు.
ఆశయ సాధనకు కృషి చేయాలి
మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్కు పూలమాలలేసి నివాళులర్పించారు. మల్కీజ్గూడ గ్రామంలో నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి ఆవిష్కరించారు. మల్కీజ్గూడ అభివృద్ధికి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య. జడ్పీటీసీ జంగమ్మ, టీఆర్ఎస్ నాయకులు రమేశ్గౌడ్, భాష, చిన్నోళ్ల యాదయ్య, రాజేందర్రెడ్డి, కారింగు యాదయ్య పాల్గొన్నారు.
తుర్కయాంజాల్లో..
తుర్కయాంజాల్, ఏప్రిల్ 14 : మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి, వైస్ చైర్ పర్సన్ హరితధన్రాజ్ గౌడ్, కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కొశికె ఐలయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇంజాపూర్, తుర్కయాంజాల్ చౌరస్తాలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు క్యామ మల్లేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ కృష్ణాగౌడ్ నివాళులర్పించారు. డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
ఎంపీ, ఎమ్మెల్సీ నివాళి..
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తూ ముందుకు సాగుతున్నరని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. వేడుకల్లో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పరమేశ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు వేణుగోపాల్, చందోజీ, సురేందర్రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్లో
అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 14 : మండల కేంద్రంలో ఎంపీపీ బుర్రరేఖ, జడ్పీటీసీ దాసుగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, బాటసింగారం ఎంపీటీసీ వెంకటేశ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాలమ్మ, బీఎస్పీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో..
టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి బహదూర్, ఎంపీపీ నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, జిల్లా నాయకురాలు శ్రీలక్ష్మి నాయకులు సుకన్య, ఏర్పుల చంద్ర య్య, జంబుల కిషన్రెడ్డి, జగన్రెడ్డి, మహేందర్, శంకర్, పరమేశ్ పాల్గొన్నారు. జాపాలలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
ఆదిబట్లలో..
ఆదిబట్ల, ఏప్రిల్ 14 : మున్సిపాలిటీ కార్యాలయంలో డీఈ మీనాక్షి అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొంగరకలాన్లోని చౌరస్తాలో అంబేద్కర్కు వివిధ పార్టీల నాయకులు నివాళులర్నించారు. మంగల్పల్లి విద్యుత్ సబ్స్టేషన్లో కౌన్సిలర్లు కృష్ణరాజు, ఉప్పరిగూడలో ఎంపీపీ కృపేశ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, అంబేద్కర్ సంఘం నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఘనంగా అంబేద్కర్ జయంతి
మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ స్వప్న అధ్యక్షతన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి, కమిషనర్ బలరాం, టీఆర్ఎస్ మున్సిపాల్టీ అధ్యక్షుడు బలరాం, కళ్లెం ప్రభాకర్రెడ్డి, చింటు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్లో..
ఇబ్రహీంపట్నం రూరల్, ఏప్రిల్ 14 : పంచాయతీల ఆవరణలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులతో పాటు అంబేద్కర్ సంఘం నాయకులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కృపేశ్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. తులేకలాన్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమణారెడ్డి పాల్గొన్నారు.
తలకొండపల్లిలో..
బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ నిర్మలశ్రీశైలంగౌడ్ అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు లలిత, ఎంపీటీసీ హేమరాజు, కోఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.