హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు లాక్డౌన్ విధించింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపునిచ్చింది. దీంతో వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు భారీగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ఉదయం 6 గంటల నుంచే నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో వాహనాల రద్దీ నెలకొన్నది. నగరంలోని పలు మార్కెట్లు, దుకాణాల వద్ద జనం బారులు తీరారు. రాంనగర్ చేపల మార్కెట్లో రద్దీ ఎక్కువగా ఉన్నది. ఉదయం 10 గంటలకు ప్రజా రవాణా సహా అన్ని బంద్కానున్నాయి.
లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల పనివేళల్లో మార్పులు చేశారు. నేటి నుంచి బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పనిచేయానున్నాయి. అదేవిధంగా పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, చిన్న పోస్టాఫీసుల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేయనున్నాయి. డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి