హైదరాబాద్ : తెలంగాణలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు పాస్పోర్టు సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ ఉధృతిని అరికట్టేందుకు ప్రభుత్వం రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21 వరకు లాక్డౌన్ విధించింది.
లాక్డౌన్ దృష్ట్యా సేవలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి వెల్లడించారు. లాక్డౌన్ అనంతరం సేవలను తిరిగి పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. పాస్పోర్టు దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.