అనంతపురం,జూలై :అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. గాండ్లపెంట మండలంలో తల్లిదండ్రులు తనకు బైక్,సెల్ఫోన్ కొనివ్వలేదని రెడ్డి బాషా అనే 18ఏండ్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెడ్డిబాషా స్వగ్రామం మలమీదపల్లి పంచాయతీ అరమడకవారిపల్లి. ఇదే మండలంలోని తూపల్లిలో నానమ్మ వద్ద ఉంటూ కదిరిలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.
తనకు బైక్,సెల్ఫోన్ కావాలని రెడ్డి బాషా తన తండ్రి నబీని అడిగాడు. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడంతో మనస్థాపానికి గురైన రెడ్డిబాషా విషపు గుళికలు మింగాడు. తర్వాత తనే స్వయంగా 108 సిబ్బందికి ఫోన్ చేయగా వారు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూమృతి చెందాడు.