పోచమ్మమైదాన్, మే 26: రాష్ట్రం కోసం అక్షర సేద్యం చేసిన ప్రముఖ కవి వెలపాటి రామారెడ్డి (90) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హన్మకొండ కనకదుర్గకాలనీలో బుధవారం తుదిశ్వాస విడిచారు. రామారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం అనే ప్రామాణిక గ్రంథం, తెలంగాణ కావ్యం, వీర తెలంగాణ, వెలుగు నీడలు, తెలంగాణ పద్య మంజరి తదితర పుస్తకాలు రాశారు.