హైదరాబాద్: రెండో విడుత కరోనా వుధృతి కొంచం తగ్గడంతో లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ రైలును దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించింది. కరోనా నేపథ్యంలో జూన్ 2న అధికారులు ఈ సర్వీసును రద్దుచేశారు. అయితే నేటి నుంచి రైలు సర్వీసును మళ్లీ ప్రారంభించారు. ఉదయం 4.40 గంటలకు బయలుదేరిన ఈ ఇంటర్సిటీ రైలు (02796) 10.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. మళ్లీ సాయంత్రం 5.30కి విజయవాడలో బయలుదేరి రాత్రి 11.20 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. అమరావతిలోని సెక్రటేరియట్లో పనిచేసే ఉద్యోగులు అత్యధికంగా ఈ రైలులో ప్రయాణిస్తూ ఉంటారు.