కొమురవెల్లి, అక్టోబర్ 28: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు లైన్మన్ నాగరాజు. హైదరాబాద్కు చెందిన వీరేందర్ గౌరాయపల్లిలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి గత ఫిబ్రవరిలో ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీ తీసి ఏఈని సంప్రదించారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇవ్వాలని ఏఈ లైన్మన్ నాగరాజుకు సూచించారు. కనెక్షన్ ఇవ్వడానికి నాగరాజు రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.10 వేలకు బేరం కుదిరింది. ఈ క్రమంలో వీరేందర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. గురువారం కొమురవెల్లి మండల కేంద్రంలోని ఓ హోటల్ వద్ద వీరేందర్ నుంచి లైన్మన్ నాగరాజు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.