హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షపు జల్లులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం(టీఎస్డీపీఎస్) తెలిపిన ప్రకారం.. సీతాఫల్మండీ, చర్లపల్లిలో సాయంత్రం 4 గంటల వరకు 8 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా తార్నాకలో 5.5 ఎంఎం వర్షపాతం నమోదైంది.
గడిచిన 24 గంటల్లో బండ్లగూడలో 18.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపారు. రానున్న కొన్ని రోజుల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంది. నగరంలో మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు సాధారణ ఉష్ణోగ్రత 25.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ కాలంలో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రత కంటే ఇది 3 డిగ్రీలు తక్కువ అని తెలిపింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు కొనసాగుతున్నాయి. దీని కారణంగా ట్రాఫిక్ కాస్త నెమ్మదించింది.