కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్ట్ ఒక గేట్ను అధికారులు ఎత్తారు. ప్రాజెక్ట్ ఐదో గేటు 0.05 మీటర్లు ఎత్తి దిగువకు 141 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ఏఈఈ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. ప్రాజెక్ట్ ఎత్తు 243.00 మీటర్లు కాగా, ప్రస్తుతం 241.900 మీటర్లకు నీరు చేరిందని పేర్కొన్నారు, ప్రాజెక్ట్ సామర్థ్యం 10.393 టీ ఎంసీలు కాగా, ప్రస్తుతం 9.374 టీఎంసీలకు చేరినట్లు విరించారు. బుధవారం రాత్రి గేటును ఇంకో 0.5 మీటర్లు ఎత్తనున్నట్లు వెల్లడించారు. కావున దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వీసీ సీతారామారావు
తెలంగాణ.. రైతు సంక్షేమ రాష్ట్రం : మంత్రి పువ్వాడ