జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవపూర్ మండలం అంబట్పల్లి పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్కు వరద ఉధృతి పెరుగుతోంది. గురువారం 1,58,320 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, 38 గేట్లను ఎత్తినట్లు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో అక్కడి ప్రాణహిత నీరు గోదావరి కలుస్తుండడంతో బరాజ్కు వరద ఉధృతి పెరుగుతున్నది. కాగా, బరాజ్లో 12.512 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1,69,84 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ములుగు జిల్లాలో బాలికపై లైంగికదాడి
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
నారింజ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద