కరీంనగర్ : లోయర్ మానేరు డ్యాం గేట్లను ఎత్తారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల నీటిమట్టం క్రమంగా పెరుగడంతో గేట్లను ఎత్తడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మానేర్ వాగు, ఎస్సారెస్పీ, మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీకి నీటి తాకిడి పెరగడంతో గేట్లు ఎత్తడం విషయమై అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో 11 వ గేట్ని ఎత్తారు.
సాయంత్రం 5 నుంచి 16 నంబర్ల వరకు గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్ఎండీలో సాయంత్రం వరకు 22 టీఎంసీల నీరు ఉండగా లక్షా 20 వేల ఇన్ ఫో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటి ఇన్ ఫ్లో ఆధారంగా గేట్ల ఎత్తడం, తగ్గించడం ఉంటుందన్నారు. గత ఏడాది ఆగస్టు 22 న నీటిని విడుదల చేయగా ఈసారి నెల ముందే ఎల్ఎండీ నుంచి విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
నిర్మల్ వర్ష ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా
ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!
గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్రావు