హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఫార్మా రంగంలో రసాయన విప్లవం ముగిసిందని, ఇక భవిష్యత్తు అంతా లైఫ్ సైన్స్దేనని భారత ప్రభుత్వం సైంటిఫిక్ అడ్వైజర్ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కే విజయ రాఘవన్ అన్నారు. సీఐఐ లైఫ్ సైన్స్ మూడొ కాంక్లేవ్లో ఆయన మాట్లాడుతూ..ఇండియన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ దేశీయ అవసరాలను తీర్చడంతోపాటు ప్రపంచ లైఫ్ సైన్సెస్ ల్యాండ్స్కేప్లో దేశాన్ని అగ్రగామిగా నిలబడాలని, అందుకు అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా పాల్గొన్నారు.