గోదావరిఖని, జూన్ 29: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి టీబీజీకేఎస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్దే విజయమన్నారు. త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. అందుకోసం టీబీజీకేఎస్ కార్యకర్తలు, నాయకులు శక్తి వంచన లేకుండా పనిచేయాలని కోరారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, సకాలంలో ఎరువులు పంపిణీ చేసి రైతులను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుతున్నట్టు చెప్పారు. సమావేశంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్, ఆర్జీ-2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, నాయకులు జాహిద్ పాషా, మండ రమేశ్, పుట్ట రమేశ్ పాల్గొన్నారు.