జోగులాంబ గద్వాల : ప్రతి ఒక్కరం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మనం నాటే మొక్కలు భావితరాలకు ఆక్సిజన్ అందిస్తాయని అని చెప్పారు. అనంతరం ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టు దగ్గర క్లస్టర్ గేట్ల మరమ్మతులకు ప్రభుత్వం పన్నెండున్నర కోట్లు విడుదల చేయగా ఎమ్మెల్యే సీఎం ఓఎస్డీ ఈఎన్సీ పెంటారెడ్డితో కలిసి మరమ్మతు పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఎవరు కూడా గేట్ల మరమ్మతులను పట్టించుకోలేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు విడుదల చేసి గేట్ల మరమ్మతు చేయిస్తుందని అని చెప్పారు.కార్యక్రమంలో పురపాలక చైర్మన్ బీఎస్ కేశవ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ విజయ్ కుమార్, మార్కెటింగ్ ఏడీ పుష్పమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం