మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణం 27వ వార్డులో మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ. 4.99 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని త్వరలో అభివృద్ధి పనులు పూర్తవుతాయన్నారు. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి అన్ని వార్డులు అభివృద్ధి చేసి మహబూబాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, తెరాస పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, నిమ్మల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్
నాటు తుపాకితో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గుండెపోటుతో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి