వికారాబాద్ : పరిగి పట్టణాన్ని సుందరంగా మారుద్దామని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణ ప్రగతిలో భాగంగా పరిగిలోని 3, 5, 7, 8 వార్డులలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో అభివృద్ది పనుల కోసం నిధులు కేటాయించామన్నారు.
త్వరలోనే ప్రతి వార్డులో రూ.10లక్షలకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్త కాలనీలలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్కో ఏఈకి ఎమ్మెల్యే సూచించారు. ప్రతి ఇంటికి మొక్కలు అందజేసి, ఇళ్ల ఆవరణలో నాటే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం