హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం (ఈ నెల 24) సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ గౌడ సంఘం పిలుపునిచ్చింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జరిగే ముక్కోటి వృక్షార్చనలో రాష్ట్రంలోని గౌడ కులస్తులందరూ పాల్గొనాలని రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క గీత కార్మికుడు మూడు మొక్కలు నాటాలని కోరారు.
సమైక్య రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైన గౌడ కులస్తులకు తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వరాలు ప్రకటించిందని తెలిపారు. అందులో భాగంగా తాటి చెట్టు మీద నుంచి పడి చనిపోయిన కుటుంబాలకు 14 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పాటు నీరా ప్రాజెక్టును తీసుకొచ్చిందని తెలిపారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్కు లక్ష్మణ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ హాస్టల్ జనరల్ సెక్రెటరీ ప్రశాంత్ గౌడ్, సభ్యులు రాజయ్య గౌడ్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ