శ్రీశైలం, ఏప్రిల్6: శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని మంగళవారం ఉదయం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితోపాటు శివసేవకులు, భక్తులు సహాయంతో లెక్కించారు. 19 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలు నగదు రూపంలో రూ.1,96,05,093 ఆదాయంగా వచ్చినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. వీటితోపాటు 282గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 9కేజీల275 గ్రాముల వెండి ఆభరణాలు మరియు 54 యూఎస్ఏ డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు, 20 ఇంగా్ంలడ్ పౌండ్స్, 7 ఓమన్ రియాల్స్, 10ఫ్రాన్స్ సూసిస్ మొదలైన విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మరుగుజ్జు మన్సూరీకి వధువు దొరికింది..
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు మమ్ముట్టి