వరంగల్ రూరల్ : ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ స్వీయ నియంత్రణతో కరోనాని అరికడదామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనాపై ఉన్న భయాన్ని పోగొట్టేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. గ్రామాలలో పారిశుధ్య పనుల్లో జాప్యం చేయొద్దని తెలిపారు.
కచ్చితంగా గ్రామాలలో కరోనాపై ప్రభుత్వం నిబంధనలు పాటించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలి. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువగా భయంతోనే మరణిస్తున్నారు. అందుకే ప్రజల్లో ఉన్న అపోహల్ని పోగొట్టేలా అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారుకరోనా సోకినా వారిలో ఇంట్లో ఉండే వసతిలేని వారు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐసోలేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని అన్నారు.
గ్రామాలలో పారిశుధ్యం లోపించకుండా చూసుకోవాల్సిన భాద్యత అధికారులదేనని అన్నారు. ప్రజలంతా కూడా ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని కోరారు.
సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, డీఎల్ పీఓ కల్పన, ఎంపిడిఓలు, ఎపిఓలు, పంచాయతీరాజ్ శాఖ, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పైల్వాన్ పూర్లో వ్యక్తి దారుణ హత్య
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన