కరీంనగర్ : చివరి గింజ కొనే వరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లాలోని హుజూరాబాద్ మండలంలోని రాజపల్లి, జమ్మికుంటలోని మార్కెట్యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కారు రైతుల మేలుకోరే ప్రభుత్వమని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. మిల్లర్లు తిరకాసులు పెట్టకుండా రైతుల ధాన్యాన్ని తీసుకోవాలని, ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులు కూడా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం శుభ్రం చేసి తేవాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
‘మల్లన్న’ ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కూలీల ఆటో బోల్తా ..నలుగురికి తీవ్ర గాయాలు