వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. వచ్చే ఐదేండ్లలో ఈ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం వరంగల్లో మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు.
వరంగల్ వాసులు చైతన్యవంతులు. అభివృద్ధికి ఓటేస్తారన్న నమ్మకాన్ని నిలబెట్టారన్నారు. దీనికనుగుణంగా వచ్చే ఐదేండ్లలో సుపరిపాలన అదించి మీ నమ్మకాన్ని నిలబెడుతామన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ నగరంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాయన్నారు.
టీఆర్ఎస్ తరఫున గెలిని 49 మంది అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంలో భాగస్వామ్యమైన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. వరంగల్ ఎన్నికలలో ముఖ్యమైన పాత్ర పోషించేందుకు అవకాశం కల్పించిన సీఎం కేసిఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంత్రులు ధన్యవాదాలు తెలిపారు.
సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ బండ ప్రకాశ్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, టిఎస్ఐఐసి చైర్మన్, జిల్లా పార్టీ ఇన్ చార్జి గ్యాదరి బాలమల్లు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం