శంషాబాద్, మే 5 : విమానాల్లో దూర ప్రయాణం చేసే వారికి వెసులుబాటు. మోబైల్ ఫోన్లో బ్యాటరీలు డిశ్చార్జ్ అయిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. స్పైక్ ఇన్నోవేషన్ సహకారంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకంగా చార్జింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయంలోని ఈ నూతన సర్వీస్ ద్వారా చార్జర్ లేని లేదా మోబైల్ బ్యాటరీ /ఇతర గాడ్జెట్లు డిశ్చార్జి అయిపోయిన ప్రయాణికులు పవర్బ్యాంకులను కిరాయికి తీసుకోవచ్చు. ఈ పవర్బ్యాంక్ స్టేషన్లు /కియోస్క్లు విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. రీ చార్జింగ్ రుసుము రూ.350 మాత్రమే.