ఫగ్వారా : తన పెండ్లిలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కమెడియన్ సుగంధ మిశ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతవారం పంజాబ్లోని ఫగ్వారాలో గల ఓ రిసార్ట్లో సుగంధ మిశ్రా వివాహం జరిగింది. వివాహ వేడుక వీడియో వైరల్ కావడంతో కొవిడ్ నిబంధనల విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. వధువు, వరుడు, రిసార్ట్ యజమానితో పాటు పలువురిపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.
ఈ వివాహ కార్యక్రమం ఏప్రిల్ 26 న జరిగింది. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ కేసు విచారణ కొనసాగుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. జలంధర్కు చెందిన మిశ్రా, మహారాష్ట్రకు చెందిన భోసలే ఇరువురు ది కపిల్ శర్మ షో ద్వారా ఫేమ్ అయ్యారు. అయినప్పటికీ వారు దాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డారు.