జార్జిరెడ్డి చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది ఢిల్లీ భామ ముస్కాన్ ఖుబ్చందాని. జార్జిరెడ్డి సినిమా ముస్కాన్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవలే అక్షయ్కుమార్ తో కలిసి లక్ష్మి చిత్రంలోనూ మెరిసిందీ బ్యూటీ. తాజాగా ముస్కాన్ తెలుగులో రెండో చిత్రానికి సంతకం చేసిందన్న వార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ హీరో రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న థ్రిల్లర్ మూవీ శేఖర్ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలిపింది. ముస్కాన్ మార్చి చివరి వారంలో అరకులో జరుగనున్న షూటింగ్లో జాయిన్ కానుందని టాక్.
డెబ్యూట్ డైరెక్టర్ లలిత్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంఎల్వీ సత్యనారాయణ, రాజశేఖర్ కూతుళ్లు శివాని-శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలన్న కసిగా ఉన్నాడు రాజశేఖర్.