9 కొత్త ధారావాహిక
జరిగిన కథ
మనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగా వతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. ఓ గిరిపుత్రుడి మాటలు కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అంతలోనే నర్మగర్భంగా మాట్లాడుతున్న ఓ బాలకుడు ప్రభువుల వారికి దిశానిర్దేశం చేస్తాడు.
మృదంగ ధ్వనులు, వీణానాదాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. చూస్తే చుట్టుపక్కల ఎవరూ లేరు. అడవిలో కొండ. నరసంచారం లేని ప్రాంతం. కానీ, ఈ మునిబాలకుడేమో.. ‘ఎవరూ లేకపోవడమేమిటి? మునులు, దేవతలు, యక్ష, గంధర్వులు శ్రీనారసింహదేవుని క్షేత్రంలోని తీర్థంలో స్వామిని సేవిస్తున్నారు’ అని అంటున్నాడు. పైగా ‘నీ గురుదేవులెవరయ్యా?’ అంటే.. ‘యాద మహర్షి’ అని స్పష్టంగా చెప్తున్నాడు.
“ఇంతకూ నీ పేరేమిటి?”
“గురుదేవులకు పేర్లుంటాయి గానీ, శిష్యులకు ప్రత్యేకంగా పేర్లెందుకు? యాదర్షి శిష్య ప్రశిష్య పరంపరలో ఒక పాదరేణువుని అంటే.. మహర్షి యాదర్షిని తలిచే కొలచే అనేకానేక శిష్యగణాలలో ఇప్పటి శిష్యుని కాలిధూళిలో ఒక మట్టి రేణువుని. ఓం నమో నారసింహాయ, యాదరుషి గురుభ్యోనమః” భక్తి పూర్వక తన్మయత్వంతో చెప్పాడు.
శ్రీ మహావిష్ణువే వామనావతారాన్ని మరోసారి ఈ బాలుడి రూపంలో ధరించాడా? అన్నట్టుగా ఒక అందమైన చిరునవ్వు. https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-7119991287654999&output=html&h=280&adk=899866424&adf=3301932544&pi=t.aa~a.3299940303~i.10~rp.4&w=600&fwrn=4&fwrnh=100&lmt=1615126115&num_ads=1&rafmt=1&armr=3&sem=mc&pwprc=8663284801&psa=1&ad_type=text_image&format=600×280&url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsunday%2F2021-03-07-142970&flash=0&fwr=0&pra=3&rh=150&rw=600&rpe=1&resp_fmts=3&wgl=1&fa=27&adsid=ChEIgJCSggYQsc6G0PCe6Zb5ARIvACnpDKZFyscNYhJRzvlXmzG6caB6-wRRDa5w0sxXdoHlU_yQmMPN2_1dLWx-Td8&uach=WyJXaW5kb3dzIiwiNi4xIiwieDg2IiwiIiwiODguMC40MzI0LjE5MCIsW11d&dt=1615126115143&bpp=8&bdt=4291&idt=-M&shv=r20210303&cbv=r20190131&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D3a288f1601d62fbd-22c2673146c60080%3AT%3D1615126171%3ART%3D1615126171%3AS%3DALNI_MarYFPYqii0JgKvRyzN0LTOtBECsg&prev_fmts=1200×200%2C300x250%2C300x250%2C160x600%2C160x600%2C0x0%2C0x0&nras=3&correlator=5036055069703&frm=20&pv=1&ga_vid=629328971.1612347956&ga_sid=1615122859&ga_hid=1187332603&ga_fc=1&u_tz=330&u_his=5&u_java=0&u_h=1024&u_w=1280&u_ah=984&u_aw=1280&u_cd=24&u_nplug=3&u_nmime=4&adx=122&ady=1896&biw=1263&bih=824&scr_x=0&scr_y=400&eid=31060287%2C21066922&oid=3&psts=AGkb-H_T18hgM-FscPCyVQSSMSJ-DhoWjJ0_f1tyB1g46CsPiUeP0bAtopi0GDnBa__pfr8pBNoiPrQztszl%2CAGkb-H_b1lJXChxTdY8ZSUHo5lxt1RAcZ145awmL-y5sQAiGeRSRV6aF45J19t9N4C-1YG2RhH3jR54AMM58-w&pvsid=1624687839811591&pem=205&ref=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsunday&rx=0&eae=0&fc=384&brdim=0%2C0%2C0%2C0%2C1280%2C0%2C1280%2C984%2C1280%2C824&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=8320&bc=31&jar=2021-03-07-13&ifi=10&uci=a!a&btvi=2&fsb=1&xpc=9keqaZc65I&p=https%3A//www.ntnews.com&dtd=286
“దేవతలు, మునీశ్వరులు.. వీరంతా ఎక్కడి నుంచి వస్తారు? స్వామిని ఏ విధంగా సేవిస్తారు?”https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-7119991287654999&output=html&h=280&adk=899866424&adf=1868815166&pi=t.aa~a.3299940303~i.11~rp.4&w=600&fwrn=4&fwrnh=100&lmt=1615126115&num_ads=1&rafmt=1&armr=3&sem=mc&pwprc=8663284801&psa=1&ad_type=text_image&format=600×280&url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsunday%2F2021-03-07-142970&flash=0&fwr=0&pra=3&rh=150&rw=600&rpe=1&resp_fmts=3&wgl=1&fa=27&adsid=ChEIgJCSggYQsc6G0PCe6Zb5ARIvACnpDKZFyscNYhJRzvlXmzG6caB6-wRRDa5w0sxXdoHlU_yQmMPN2_1dLWx-Td8&uach=WyJXaW5kb3dzIiwiNi4xIiwieDg2IiwiIiwiODguMC40MzI0LjE5MCIsW11d&dt=1615126115143&bpp=7&bdt=4291&idt=7&shv=r20210303&cbv=r20190131&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D3a288f1601d62fbd-22c2673146c60080%3AT%3D1615126171%3ART%3D1615126171%3AS%3DALNI_MarYFPYqii0JgKvRyzN0LTOtBECsg&prev_fmts=1200×200%2C300x250%2C300x250%2C160x600%2C160x600%2C0x0%2C0x0%2C600x280&nras=4&correlator=5036055069703&frm=20&pv=1&ga_vid=629328971.1612347956&ga_sid=1615122859&ga_hid=1187332603&ga_fc=1&u_tz=330&u_his=5&u_java=0&u_h=1024&u_w=1280&u_ah=984&u_aw=1280&u_cd=24&u_nplug=3&u_nmime=4&adx=122&ady=2224&biw=1263&bih=824&scr_x=0&scr_y=400&eid=31060287%2C21066922&oid=3&psts=AGkb-H_T18hgM-FscPCyVQSSMSJ-DhoWjJ0_f1tyB1g46CsPiUeP0bAtopi0GDnBa__pfr8pBNoiPrQztszl%2CAGkb-H_b1lJXChxTdY8ZSUHo5lxt1RAcZ145awmL-y5sQAiGeRSRV6aF45J19t9N4C-1YG2RhH3jR54AMM58-w&pvsid=1624687839811591&pem=205&ref=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsunday&rx=0&eae=0&fc=384&brdim=0%2C0%2C0%2C0%2C1280%2C0%2C1280%2C984%2C1280%2C824&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=8320&bc=31&jar=2021-03-07-13&ifi=11&uci=a!b&btvi=3&fsb=1&xpc=GZ95cCdCI8&p=https%3A//www.ntnews.com&dtd=304
“తమ తమ నెలవులనుంచి దేవతలు, వేంకటగిరి పవిత్ర గిరులనుంచి మునులు ఇక్కడికి తరలివస్తారు. వారు వచ్చారని అనడానికి నిదర్శనంగా ఈ ప్రాంతంలో మృదంగ ధ్వనులు వినిపిస్తాయి. శ్రీ నరసింహ స్వామి స్వయంభువుగా కొలువైన యాదగిరీశుని కొండ యాదరుషి గురుదేవుల పేరుమీదనే ఏర్పడింది. అందుకే ఇది ‘యాదగిరి కొండ’ అయింది”
త్రిభువనమల్లుడికి తనువు పులకరించింది.
‘ఎంతటి అదృష్టం తనది?’
తను నిలబడి ఉన్న ఈ పవిత్ర ప్రదేశంలో యాదర్షి వంటి మహా తపస్సంపన్నుడు, యుగ పురుషుడు నడయాడాడంటే..? స్వామివారి దర్శనం కోసం మహా మహిమాన్వితమైన తపస్సు చేశాడంటే..? అసలు ఆ విషయం తల్చుకుంటుంటే హృదయమంతా ఒక అద్భుతమైన అలౌకిక భావనతో తరించి పోతున్నది.
ఒక సందేహం కలిగింది.
“అయితే.. అంత గొప్ప తపస్సు చేసిన తర్వాతనే కదా శ్రీ నరసింహ స్వామివారు యాదర్షికి దర్శనమిచ్చారు”
సాలోచనగా అన్నాడు త్రిభువనమల్లుడు.
“అవును కదా మరి.. గొప్ప తపస్సే చేయవలసి వచ్చింది”
“మరి.. నాకు స్వామివారి దర్శనం దొరుకుతుందా?” త్రిభువనుడి నిరాశ ఆ మాటలో ధ్వనించింది.
చిన్నగా చిరునవ్వుతో అన్నాడు బాలుడు.
“ఈ కలియుగంలో తపస్సే చేయవలసిన పనిలేదు. మనసులో త్రికరణశుద్ధిగా సంకల్పిస్తే చాలు. ఆయన నామస్మరణ చేస్తే చాలు. అడ్డంకులు ఎదురైనా, స్వామి దర్శనం కోసం మనం ఇంటినుంచి బయలుదేరితే చాలు. ఎలా రప్పించుకోవాలో.. మొక్కులు మనతో ఎలా ఇప్పించుకోవాలో.. నారసింహుడికి తెలుసు. ఇంకా చెప్పాలంటే స్వామిని నమ్ముకుంటే.. కొండలు తొలగిపోయి మనకు దారినిస్తాయి. అడవులూ, నదీనదాలు దారిని ఏర్పరుస్తాయి. కాకపోతే పరీక్షలకు తట్టుకోవాలి. నిలబడాలి. వెనుకడుగు వేయకూడదు. ఇంకో విషయం. స్వామివారు తమ నిజ స్వరూపంతో మనకు దర్శనమిస్తారని అనుకోవద్దు. ఈ సర్వసృష్టిలో సకల ప్రాణికోటిలో ఏ రూపమైనా వారు ధరించవచ్చు. కనిపించవచ్చు. మనకు సరైన దారి చూపవచ్చు”
“ఏ రూపంలోనైనా స్వామివారు మనకు కనిపించవచ్చా? మారువేషంలో ఉన్న నరసింహస్వామిని.. మామూలు మనుషులు గుర్తుపట్టేది ఎలా?” ప్రశ్నించాడు త్రిభువనుడు.
దానికి ‘చిరునవ్వే’ సమాధానం.
“నీ మాటల్లో ఏదో మర్మం కనిపిస్తున్నది. నీ నవ్వులో ఏదో తెలియని చతురత ఉన్నది. ఒకే ఒక ప్రశ్న”
“అడుగు.. నీ ప్రశ్నల పరంపర ఆగేట్టు లేదు”
“స్వామివారిని దర్శంచవలసిందిగా నాకు సంకేతాలు అందాయి. ఒకవైపు కుమారుడి వ్యాధి, మరొకవైపు పొరుగురాజు యుద్ధోన్మాదం. ఈ సమయంలో వాటిని పక్కనపెట్టి, కేవలం స్వామిని దర్శించుకోవాలని ఒక భక్తుడిగా ఈ కొండపైన అడుగుపెట్టాను. నా కోరిక తీరుతుందా? నా లక్ష్యం నెరవేరుతుందా?” సమాధానం కోసం అర్థిస్తున్నట్టుగా అడిగాడు త్రిభువనుడు. త్రిభువనుడిని ఆపాదమస్తకం పరిశీలించాడు.
“అనుకుంటూనే ఉన్నా. ఒంటిపైన ఉత్తరీయం, అంగవస్త్రమూ తప్ప వేరేది లేకపోయినా.. ఎవరితను? ఏదో దాస్తున్నాడు అనుకున్నా! పొరుగురాజు యుద్ధోన్మాదం గురించి మాట్లాడుతున్నావంటే, నువ్వు సామాన్య పౌరుడివి కాదు. మారువేషంలో ఉన్న మహారాజువి. ఔనా!” అడిగాడు బాలకుడు.
‘అవును’ అన్నట్టుగా తల ఊపాడు.
“నేను వచ్చిన పని సఫలమవుతుందా?”
“నువ్వు వచ్చిన పని, కోరుకుంటున్న కోరికా.. ఏమిటి?
శత్రు రాజుపైన విజయమా? కన్నకొడుకు వ్యాధి నివారణా? లేక కేవలం స్వామి దర్శనమా?”
ఈ మూడింట్లో ఏది అన్నట్టుగా అడిగాడు బాలుడు.
‘అవును.. ఈ ముని బాలకుడు అడిగినట్టు.. తను కోరుకుంటున్న కోరిక ఏమిటి?
కన్న కొడుకుకు ఏర్పడ్డ ప్రాణాంతకమైన వ్యాధి తగ్గిపోవటమా?’ https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-7119991287654999&output=html&h=280&adk=899866424&adf=4074572887&pi=t.aa~a.3299940303~i.35~rp.4&w=600&fwrn=4&fwrnh=100&lmt=1615126214&num_ads=1&rafmt=1&armr=3&sem=mc&pwprc=8663284801&psa=1&ad_type=text_image&format=600×280&url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsunday%2F2021-03-07-142970&flash=0&fwr=0&pra=3&rh=150&rw=600&rpe=1&resp_fmts=3&wgl=1&fa=27&adsid=ChEIgJCSggYQsc6G0PCe6Zb5ARIvACnpDKZFyscNYhJRzvlXmzG6caB6-wRRDa5w0sxXdoHlU_yQmMPN2_1dLWx-Td8&uach=WyJXaW5kb3dzIiwiNi4xIiwieDg2IiwiIiwiODguMC40MzI0LjE5MCIsW11d&dt=1615126115224&bpp=5&bdt=4373&idt=5&shv=r20210303&cbv=r20190131&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D3a288f1601d62fbd%3AT%3D1615126171%3AS%3DALNI_Mboeb8OjO_ssLdeTCuzXC7U9t3unA&prev_fmts=1200×200%2C300x250%2C300x250%2C160x600%2C160x600%2C0x0%2C0x0%2C600x280%2C600x280&nras=5&correlator=5036055069703&frm=20&pv=1&ga_vid=629328971.1612347956&ga_sid=1615122859&ga_hid=1187332603&ga_fc=1&u_tz=330&u_his=5&u_java=0&u_h=1024&u_w=1280&u_ah=984&u_aw=1280&u_cd=24&u_nplug=3&u_nmime=4&adx=122&ady=4461&biw=1263&bih=824&scr_x=0&scr_y=1263&eid=31060287%2C21066922&oid=3&psts=AGkb-H_T18hgM-FscPCyVQSSMSJ-DhoWjJ0_f1tyB1g46CsPiUeP0bAtopi0GDnBa__pfr8pBNoiPrQztszl%2CAGkb-H_b1lJXChxTdY8ZSUHo5lxt1RAcZ145awmL-y5sQAiGeRSRV6aF45J19t9N4C-1YG2RhH3jR54AMM58-w%2CAGkb-H9-e8eMiod2V35PbKXqsA4g8Ke8hPzArCsU0QJtoGGRgB99I-utnnIh-XI4YJ3bOPjS8gSQAgVLcpY&pvsid=1624687839811591&pem=205&ref=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsunday&rx=0&eae=0&fc=384&brdim=0%2C0%2C0%2C0%2C1280%2C0%2C1280%2C984%2C1280%2C824&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=8320&bc=31&jar=2021-03-07-13&ifi=12&uci=a!c&btvi=4&fsb=1&xpc=HY67LsOTdJ&p=https%3A//www.ntnews.com&dtd=99032
‘మన కుమారుడు మందులేని వ్యాధితో మరణిస్తే.. నాకు కూడా మరణమే మందు! నేను కూడా బతకలేను’
తన పట్టమహిషి, ధర్మపత్ని చంద్రలేఖ మాటలు గుర్తొచ్చాయి.
ఇక యుద్ధంలో గెలువలేక పోతే, తాను ఎంతో కష్టపడి నిర్మించిన భువనగిరి సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది. తనను దైవాంశ సంభూతుడిగా, కారణజన్ముడిగా భావించి, తన పరిపాలనలో సుఖసంతోషాలతో జీవిస్తున్న ప్రజల జీవితాలు ప్రశ్నార్థకాలవుతాయి.
తన కిరీటం గురించి, తనకొచ్చిన కీర్తి గురించి కాదు తన బాధ!
యుద్ధోన్మాదంలో శాంతిభద్రతలు క్షీణించి తలకిందులైపోయే సామాన్యుల పరిస్థితి గురించే వ్యథ!
వీటన్నిటి కంటే ఎక్కువగా.. ఇప్పుడు తను కోరుకుంటున్నది కొండగుహలో కొలువైన సింహదేవుడి దర్శనమే.
శ్రీ నరసింహ స్వామి స్వయంభువుగా కొలువైన యాదగిరీశుని కొండ ..యాదరుషి గురుదేవుల పేరుమీదనే ఏర్పడింది. అందుకే ఇది ‘యాదగిరి కొండ’ అయింది. ఈ పవిత్ర ప్రదేశంలో యాదర్షి వంటి మహా తపస్సం పన్నుడు, యుగ పురుషుడు నడయాడాడంటే..? స్వామివారి దర్శనం కోసం మహా మహిమాన్వితమైన తపస్సు చేశాడంటే..? అసలు ఆ విషయం తల్చుకుంటుంటే హృదయమంతా ఒక అద్భుతమైన అలౌకిక భావనతో తరించి పోతున్నది
నమో నారసింహ!’
తనకు ఈ మూడూ ముఖ్యమే. ఎడమ కన్ను కావాలా? కుడికన్ను కావాలా? అంటే ఏం చెప్పాలి. ఒక్కటే కోరుకోమంటే ఏది కోరుకోవాలి?
ఏది నిధి? ఏది విధి?
ఏది రుణం? ఏది తృణం?
ఏది ఆత్మీయం? ఏది పరమాత్మీయం?
“ఏదో ధర్మ విచారంలో పడ్డట్టున్నావ్. పరిష్కారం కోసం ఇంత కష్టపడి వచ్చిన వాడివి. అసలు సమస్య ఏదో చెప్పలేకపోతున్నావ్. ‘ఇది కావాలి’ అని అడిగితేనే కదా స్వామివారికి తెలిసేది. అది ఇవ్వాలా? వద్దా? అనేది ఆయన దయ, మన ప్రాప్తం!”
అంటూనే ఒక్కసారిగా కొండ చివరన వెలుగుతున్న కాంతిని చూశాడా బాలుడు.
“స్వామి, స్వామి.. నేను వస్తున్నా. అదిగో స్వామి వారిని సేవించుకొనే వేళ అయింది. నేను వెళ్లాలి. గురుదేవులంతా అక్కడికి చేరుకున్నారు. నమో నారసింహ”.
భక్తిగా చేతులు జోడించి తన్మయత్వంతో చెప్పాడు బాలుడు.
“ఎవరు? ఎక్కడ? నాకు కొండపైన వెలుగు తప్ప ఏమీ కనిపించటం లేదు.
ఎవరున్నారక్కడ?”
“అందరూ ఉన్నారు.. మా ఆది గురుదేవులు యాదర్షి వారు ఏర్పరచిన మహా పుష్కరిణి. కొండపైన ఉంది.
అదిగో.. అక్కడే మునీశ్వరులు, దేవతలు స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు”.
“పుష్కరిణిని యాదర్షి వారు ఏర్పరిచారా?” సంభ్రమంగా ప్రశ్నించాడు త్రిభువనుడు.
“అవును. అంతకుముందే అది దృశ్యాదృశ్యంగా ఏర్పడి ఉంది. శ్రీ నారసింహుని పాదాలను బ్రహ్మాదిదేవతలు కడుగగా ఏర్పడిన సహజమైన జలవనరు. దానినే ‘విష్ణు పుష్కరిణి’ అని పిలిచారు గురుదేవులు. అదిగదిగో.. స్తోత్రపాఠాల దివ్య సుస్వరనాదాలు, ముక్కోటి దేవతలు, మునులు ఒక్కటై.. ఆ అపూర్వమైన జ్వాలా చక్రంలో ప్రభవించిన శ్రీ నారసింహస్వామి వారిని ముక్తకంఠంతో అనుగ్రహం కోసం అర్థిస్తున్నారు..
మళ్లీ కలుద్దాం.. నమో శ్రీ నారసింహా..” అంటూనే వేగంగా అడుగులు వేసుకుంటూ.. క్షణకాలంలో ఆ కొండపైనున్న ఓషధీ వృక్షాల వరుసలో కలిసిపోయాడు.
‘ఇంతలో ఎక్కడికి వెళ్లిపోయాడీ బాలుడు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు.
అది స్వామివారే చెప్పాలేమో.. ప్రస్తుతం తన ముందున్న విధి స్వామిదర్శనం ఒక్కటే..’
అనేక భావాలు మదిలో సంఘర్షిస్తుండగా.. మౌనంగా అడుగు ముందుకు వేశాడు.
హొయసల రాజ్యంలో.. మహారాజు విష్ణువర్ధనుడి ఆంతరంగిక మందిరంలో..
మహారాజు విష్ణువర్ధనుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
ఆయననే చూస్తూ గవాక్షం వద్ద నిలబడి ఉన్న రాణి, భర్త ఆలోచనా ముద్ర చూసి ముందుకొచ్చింది.
“ప్రభూ”
“ఊ..” తలకూడా తిప్పలేదు.
“ఏమిటింత తీవ్రమైన ఆలోచనలలో లీనమై ఉన్నారు?”
“మహారాణి శాంతలాదేవి! చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న శుభఘడియ వచ్చింది. ఇక ఆలస్యం అనవసరం. అందుకే, యుద్ధ సన్నాహాలు వేగవంతం చేశాం”.
మహారాజు మనసులో ఒకటి అనుకున్నారంటే అది వెంటనే అమలు అయిపోతుందని రాణీ శాంతలాదేవికి తెలుసు.
కానీ, ఒక ముఖ్యమైన సమాచారం చెప్పాల్సి వుంది.
“దేవీ.. భయం అక్కర్లేదు. నీ భర్త కత్తికి ఎదురు లేదు. అవతల ఉన్నది త్రిభునమల్లుడైనా.. అలాంటి వారు నూరుగురు అయినా.. యుద్ధంలో జయించి, అతని శిరస్సును ఖండించి, దానిపై మా పాదపీఠికను నిలుపుతాం. అఖండమైన హొయసల రాజ్యాన్ని మరింత విస్తరింప చేస్తాం. ఏ శక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు. నీవు చేయవలసింది ఒక్కటే. మాకు హారతి ఇచ్చి కదనరంగానికి సాగనంపడమే”
అది ఆత్మవిశ్వాసంగా కాక యుద్ధోన్మాద ప్రకటనలా అనిపించింది.
“ఈ ఆనంద సమయంలో.. మాకు నీ నృత్యం చూడాలని ఉన్నది. ఆనాడు లక్ష్మీ మందిరంలో నీ నాట్యం చూసి సమ్మోహితుడినైన జ్ఞాపకం ఇంకా నా మదిలో పదిలంగా ఉంది”
ఒకనాడు.. అనుకోకుండా ఒక ఆలయంలో నృత్యం చేస్తున్న ‘శాంతల’ను చూసి ఇష్టపడ్డాడు.
ఆమె ఒక యోధుని కుమార్తె. నాట్యం ఆమెకు ఎంతో ప్రీతికరమైన వ్యాపకం.
యువకుడిగా ఉన్న విష్ణువర్ధనుడు తన నాట్యాన్ని, తననే తదేకంగా చూస్తున్న సన్నివేశం గుర్తుకొచ్చి పెదాలపైన చిరునవ్వు విరిసింది.
“ఎందుకో చిరునవ్వు” అడిగాడు రాజు.
“కత్తికీ.. కళకూ కల్యాణం జరిగిన మధుర ఘడియలు గర్తుకొచ్చి” సిగ్గుపడింది.
“ప్రభూ! ఒక్క నిమిషం..”
“ఏమిటది?”
“ఈ యుద్ధం ఇప్పుడు అవసరమా?”
“తప్పదు” కఠినంగా చెప్పాడు.
“కానీ..”
“ఏమిటా సందేహం. మా శక్తిపైనా?
యుక్తిపైనా?”
“అదికాదు ప్రభూ.. తెలియరాని ఏ శక్తి అడ్డు పడుతున్నదో..? ఇంతవరకూ మనకు సంతానభాగ్యం లేదు. మీకు వారసుడిని ఇవ్వవలసిన ఈ పట్టపురాణి నిస్సహాయంగా ఉండి పోతున్నది” కంటనీరు అదిమి పెట్టుకుంటూ చెప్పింది.
శ్రీ నారసింహుని పాదాలను బ్రహ్మాది దేవతలు కడుగగా ఏర్పడిన సహజమైన జలవనరు. దానినే ‘విష్ణు పుష్కరిణి’ అని పిలిచారు గురుదేవులు. అదిగదిగో.. స్తోత్రపాఠాల దివ్య సుస్వరనాదాలు, ముక్కోటి దేవతలు, మునులు ఒక్కటై.. ఆ అపూర్వమైన జ్వాలా చక్రంలో ప్రభవించిన శ్రీ నారసింహస్వామి వారిని ముక్తకంఠంతో అనుగ్రహం కోసం అర్థిస్తున్నారు..
“అయితే.. వారసుడు లేడు కనుక యుద్ధానికి వెళ్లవద్దంటున్నావా? అనుకొనేది జరిగితే.. నీ భర్త వీరమరణం పొందితే.. రాజ్యానికి వారసుడు ఉండడని.. రాజులేని రాజ్యం అవుతుందని కదూ నీ మనోవ్యథ”.. ఆ మాటలు పూర్తి కాకుండానే అతని నోటికి తన చేతిని అడ్డుపెట్టింది.
“మీరు అనరాని మాటలు, నేను వినరాని మాటలు ఎందుకు అంటారు? అలా ఎప్పటికీ జరుగదు. యుద్ధంలో గెలుపు మీదే”
అతని వదనంలో గర్వం తొణికిసలాడింది. అది చూసి శాంతలాదేవి ఇంకోమాట మాట్లాడలేక పోయింది. కానీ, తన వివాహ నిశ్చయ సందర్భంలో తమ కుటుంబ జోతిష్కులు ..చెప్పిన మాటలు..
చేసిన హెచ్చరిక.. ఇంకా తన స్మృతిపథంలో పదే పదే మెదులుతున్నాయి.
(మిగతా వచ్చేవారం)
అల్లాణి శ్రీధర్
allanisreedharthewriter@gmail.com