చెన్నై: శశికళతో మాట్లాడే వారిని పార్టీ నుంచి బహష్కరిస్తామని తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే తమ నేతలను హెచ్చరించింది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. తాను త్వరలోనే క్రీయాశీల రాజకీయాల్లోకి వస్తానని, అన్నాడీఎంకేపై పట్టుసాధిస్తానని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలతో వీకే శశికళ ఇటీవల మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ బయటపడింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కీలక నిర్ణయం తీసుకున్నది. శశికళతో మాట్లాడే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని నేతలను హెచ్చరించింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై క్రమశిక్షణ కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. అనంతరం శశికళతో ఇటీవల మాట్లాడిన 16 మంది పార్టీ కార్యకర్తలను అన్నాడీఎంకే బహిష్కరించింది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన పార్టీ ప్రతినిధి వీ పుగజేండిని కూడా బహిష్కరించింది.