కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ విచారణ కొనసాగుతున్నది. గురువారం ఉదయం నుంచి రాష్ట్రంలో పర్యటించిన కమిటీ సభ్యులు.. హింస జరిగిన పలు ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఎవరు హింసను ప్రేరేపించారు..? ఎవరు హింసకు గురయ్యారు..? అనే విషయంలో ఆరా తీశారు. తాజాగా ఈ ఉదయం కోల్కతాలోని రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ జగదీప్ ధన్కర్ను కలిశారు. ఈ రోజు కూడా బెంగాల్లోని పలు ప్రాంతాల్లో నిజనర్ధారణ బృందం పర్యటించే అవకాశం ఉన్నది.