సదాశివనగర్, జూన్ 13: బంధువుల అంత్యక్రియలకు వెళ్లిన వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి ఎక్స్రోడ్పై ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. తాడ్వాయి మండలం సంగోజివాడికి చెందిన గడ్డం లక్ష్మి(28), గడ్డం మమత(30) బంధువులతో కలిసి ఆదివారం నిజామాబాద్ జిల్లా కులాస్పూర్లో బంధువు అంత్యక్రియలకు ఆటోలో వెళ్లి తిరుగుయనమయ్యారు. పద్మాజివాడి వద్దకు రాగానే ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న మమత అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ లక్ష్మిని లారీ కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లడంతో ప్రాణాలు వదిలింది. ఆటోలో ఉన్న సాయిలు, భూపతి, మమత భర్త ఆ టో డ్రైవర్ గడ్డం చిన్నబాలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.