హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో స్టాంపు లు, రిజిస్ట్రేషన్లశాఖ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ నిబంధనలను సడలించింది. ముందస్తు స్లాట్ బు కింగ్ చేసుకున్నవారితోపాటు..నేరుగా వచ్చినవారికి కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించింది. గతంలో స్లాట్ బుక్ చేసుకున్నవారికి మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించింది. గతంలోనూ స్లాట్ బుక్ చేసుకున్నవారితోపాటు, నేరుగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చేవారికి సైతం రిజిస్ట్రేషన్లు చేసేవారు. కరోనా ఉద్ధృతి, లాక్డౌన్ నేపథ్యంలో స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేశారు. ఒక రిజిస్ట్రేషన్కు గరిష్ఠంగా ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టంచేశారు.
జీపీవోలో రేపట్నుంచి ఆధార్ సేవలు
హైదరాబాద్ జనరల్ పోస్టాఫీస్ (జీపీవో)లో ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేషన్ సేవలు బుధవా రం నుంచి రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, వికలాంగులకు తొలి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.