తిరుమలగిరి, జూలై 20: మంచానికే పరిమితమైన ఓ మహిళ అభ్యర్థన మేరకు తాసిల్దార్ ఆమె ఇంటికి వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాలకు చెందిన ఆకుల వెంకటమ్మ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నది. కార్యాలయానికి వచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆమె అభ్యర్థన మేరకు తాసిల్దార్ సంతోష్కిరణ్ సిబ్బందితో కలిసి మంగళవారం వారి ఇంటికే వెళ్లారు. వెంకటమ్మ భర్త వీరసోములు పేరిట ఉన్న 10గుంటల భూమిని ఆమె పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు.