హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రమజీవులు చెమట చుకలు రాలిస్తేనే అభివృద్ధి సాధ్యమైందని, మానవజాతి పురోగతి కష్టంచేసే చేతుల మీదినించే కొనసాగుతూ వస్తున్నదని సీఎం తెలిపారు. వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులతోపాటు వ్యవసాయాధారిత భారతదేశంలో అధిక జనాభా భూమిని నమ్ముకొని బతుకుతున్నారని పేరొన్నారు. రైతులుగా, కూలీలుగా, వ్యవసాయ అనుబంధ వృత్తి కులాలుగా తమ శ్రమను ధారపోస్తూ దేశ, రాష్ట్ర అభివృద్ధిలో వారు భాగస్వాములైనారని సీఎం కేసీఆర్ కొనియాడారు. మేడే స్ఫూర్తితో సబ్బండ వృత్తి కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిషలూ కృషిచేస్తున్నదని, ఆదర్శవంతమైన కార్మిక కర్షక విధానాలను అమలు పరుస్తున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. వృత్తి కులాల కోసం, పేరుపేరునా అమలుచేస్తున్న పథకాలు వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠంచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం వివరించారు. ఉత్పత్తి సేవారంగాల అభివృద్ధి, కార్మికుల సంక్షేమం దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న పారిశ్రామిక విధానం తెలంగాణలో సంపద సృష్టితోపాటు లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడుతున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్: మంత్రి మల్లారెడ్డి
సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని కార్మికశాఖ మంత్రి మ ల్లారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా బోయినపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్కేవీ నేతృత్వంలో కార్మిక జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి రాజశేఖర్, టీఆర్ఎస్కేవీ ట్యాక్సీ సెక్టార్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణభవన్లో జరిగిన మేడే ఉత్సవాల్లో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్ జెండాను ఆవిష్కరించారు.