ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడికి తీర్మాన ప్రతి అందజేత
జమ్మికుంట, సెప్టెంబర్ 22: రాష్ట్రంలోని కుమ్మరుల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారని, తమను అన్ని విధాలా ఆదుకుంటున్న టీఆర్ఎస్కే తమ మద్దతు ఉంటుందని కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్రావు ప్రకటించారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు వచ్చారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ నివాసంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని కుమ్మర సంఘం నాయకులు, సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, పలు అం శాలపై నాయకులు, సభ్యులతో చర్చించారు. రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపే నిలబడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ ప్రతిని ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్కు అందజేశారు. ఈ నెల 26న జమ్మికుంటలో కుమ్మరుల ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నామని తెలిపారు.