శ్రీశైలం, ఏప్రిల్ 30 : శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవం (సాత్వికబలి) శాస్ర్తోక్తంగా జరిగింది. ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో తెల్లవారుజామున గ్రామదేవత అంకాలమ్మకు, హరిహరరాయ గోపురద్వారం వద్ద కొలువైన మహిశాసురమర్థినీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భ్రమరాంబాదేవికి ఏకాంతంగా ప్రాత:కాల పూజలు చేశారు. నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి అంతరాలయంలో అన్నంరాశులు పోసి పిండిదీపాన్ని వెలిగించిన తర్వాత స్వామివారికి ప్రదోషకాల పూజలు, అన్నాభిషేకం చేశారు.