గంభీరావుపేట, జూలై 1 : గొర్రెల కోసం సామూహిక ఆవాసాలు నిర్మించేందుకు సముద్రలింగాపూర్ సర్పంచు రాజిరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కౌటిల్యరెడ్డి తీసుకున్న చొరవ అభినందనీయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సముద్రలింగాపూర్లో రూ.37.80 లక్షల ఖర్చుతో నిర్మించిన సామూహిక గొర్రెల షెడ్లను గురువారం ఆయన ప్రారంభించారు. ‘గ్రామంలో గొర్రెలు, మేకల కోసం 42 షెడ్ల నిర్మించడంతోపాటు, వాటిని యాదవ కుటుంబాలకు అప్పగించేందుకు సర్పంచు రాజిరెడ్డి, అధికారిణి కౌటిల్యరెడ్డి తీసుకున్న చొరువ ఆకట్టుకున్నది’ అంటూ కేటీఆర్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.వారి చొరవ అభినందనీయం