దేశంలో కరోనా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. మహమ్మారిపై భారత్ పోరాటంలో సహాయం చేయడానికి చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కరోనా విపత్కర పరిస్థితుల్లో తన వినియోగదారులకు అత్యవసర సేవలందించేందుకు
ముందుకొచ్చింది. కొవిడ్ అత్యవసర సేవలను యూజర్లకు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా అందించడాన్ని ప్రారంభించింది.
వినియోగదారులకు కొవిడ్ ఎస్ఓఎస్ రిసోర్స్తో ఔషధాలు, ఆక్సిజన్, ప్లాస్మా దాతలు, అంబులెన్స్, హాస్పిటల్లో బెడ్లు, టెస్టింగ్ కేంద్రాల వంటి ముఖ్యమైన సమాచారంతో పాటు వ్యాక్సినేషన్ స్లాట్లను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని యాప్ ద్వారా అందిస్తోంది. థాంక్స్ యాప్లోని ఎక్స్ప్లోర్ సెక్షన్లో కొవిడ్ సపోర్ట్, సంబంధిత సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసుకునేలా సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. యూజర్లు తమతో పాటు సన్నిహితులకు టీకా స్లాట్ను యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.