వనపర్తి : మనోధైర్యంతో ముందుకు సాగి కరోనాను రూపుమాపాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆదేశాలతో దవాఖానలను సందర్శిస్తున్నామని తెలిపారు. కరోనా వచ్చిన వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ఎట్టి పరిస్థితిలోనూ మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించటం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చని తెలిపారు.
అన్ని జిల్లాసెంటర్ల వద్ద అన్ని రకాల వసతులతో కోవిడ్ సెంటర్లను ఎర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఏమాత్రం అసౌకర్యాలు కల్పించకుండా ప్రజల ప్రాణాలను కాపాడుతున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి మొత్తం సమాజం రుణపడి ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు భేష్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్