హైదరాబాద్(నమస్తే తెలంగాణ)/ మల్యాల, జూన్14: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం లో ఎప్పుడూ ముందుండే ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి పెద్దమనసు చాటుకొన్నా రు. కరోనా బారినపడి తండ్రి మరణిం చడంతో అనాథలైన ముగ్గురు పిల్లలకు ఆపన్న హస్తం అందించి అండగా నిలిచారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓగులాపూర్కు చెందిన బూసి సత్తయ్య గల్ఫ్ నుంచి ఇటీవల ఇంటికి తిరిగొచ్చి కొవిడ్తో కన్నుమూశాడు. ఆయన కుమార్తెలు అక్షర(11), సాహితి (9), కుమారు డు హర్షవర్ధన్(7) అనాథలయ్యారు. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక అల్లాడుతున్నా మని, సాయంచేయాలని అక్షర మాట్లాడిన వీడియోను స్థానికుడు సాయికిరణ్ సోమవా రం మంత్రి కేటీఆర్కు, ఎమ్మెల్యే రవిశంకర్కు ట్వీట్చేశాడు. మంత్రి వెంటనే స్పందించారు. పిల్లల రక్షణకు తక్షణ చర్యలు తీసుకుంటామని అభయమిచ్చారు. పిల్లల అవసరాలను తీర్చి జాగ్రత్తగా చూసుకోవాలని జగిత్యాల కలెక్టర్, ఎమ్మెల్యే రవిశంకర్కు సూచిస్తూ రీట్వీట్ చేశా రు. ఎమ్మెల్యేతోపాటు అధికారులు గ్రామానికి వెళ్లారు. తక్షణసాయంగా రూ.లక్ష అందజేశా రు. వారిని గురుకుల పాఠశాలలో చేర్పిస్తామని, డబుల్ బెడ్రూం మంజూరు చేయిస్తామని హా మీఇచ్చారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్కు తెలియజేయడంతోపాటు పిల్లలను కలిసిన ఫొటోలను ఎమ్మెల్యే రవిశంకర్ ట్వీట్చేశారు.