ఎల్లారెడ్డిపేట, జూలై 29: నరాల సంబంధ వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్న ఓ వలసకూలీకి మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. చికిత్సకు రూ.3లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి ఔదార్యాన్ని చాటుకొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి నూరోజు లక్ష్మణ్ చిన్న వయస్సులోనే ఉపాధి కోసం ముంబైకి వలసవెళ్లాడు. ఆయనకు భార్య స్వప్న, కవల పిల్లలు రిషికేష్, రిషిత ఉన్నారు. ఈ నెల 7న లక్ష్మణ్ ముంబైలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. నడుం కింది భాగం చచ్చుబడిపోయింది. మిత్రులు ముంబైలోని ఓ దవాఖానలో చేర్పించారు. ఈ నెల 14న సొంతూరికి తీసుకువచ్చారు.లక్ష్మణ్ దయనీయస్థితిని స్థానిక నేతలు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు. స్థానిక నాయకులు గురువారం లక్ష్మణ్కు చెక్కు అందించారు. మంత్రి కేటీఆర్కు లక్ష్మణ్ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.