నిమ్స్లో చేరాలని మంత్రి కార్యాలయం నుంచి ఫోన్
చేర్యాల, జూలై 21: కిడ్నీ బాధితుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. వెంటనే నిమ్స్లో చేరాలని మంత్రి కార్యాలయం నుంచి బాధిత కుటుంబానికి ఫోన్ రావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు మహ్మద్ సద్దాం 15 నెలలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, ఇప్పటికే లక్షల్లో డబ్బులు ఖర్చు చేసినా నయం కాలేదని, సద్దాంకు మెరుగైన వైద్యం చేయించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కాశేగుడిసెల సర్పంచ్ షేక్ ఫకీర్, యువకుడు ప్రశాం త్.. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సీఎంవో కార్యాలయంతోపాటు హీరో సోనూసూద్కు ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ మెరుగైన వైద్యం అందిస్తామంటూ రీట్వీట్ చేశారు. అన్ని ఏర్పాట్లు చేస్తామని, వెంటనే నిమ్స్లో చేరాలని మంత్రి కేటీఆర్ కార్యాలయం నుంచి బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చినట్టు సర్పంచ్ తెలిపారు.