టీఆర్ఎస్ అభ్యర్థుల ముమ్మర ప్రచారం
ఆశీర్వదిస్తే అండగా ఉంటామన్న అభ్యర్థులు
జడ్చర్లలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 25: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మొత్తం 27వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికెళ్లి ఓటర్లను కలసి ‘కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి..మీకు అన్ని వేళలా అండగా ఉంటాం’ అంటూ భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి ఓటర్లకు వివరిస్తూ టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్ వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.
ప్రచారం సాగుతుందిలా..
1వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఫేహిమినాజ్ అంభభవానీ ఆలయం, పోటుగడ్డ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికెళ్లి ఓటర్లను కలసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం చేశారు.
2వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బుక్క మహేశ్ గుల్షన్నగర్, ఆదర్శనగర్కాలనీ, ప్రాంతాల్లో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు.
3వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ గౌరిశంకర్కాలనీ, సత్యనారాయణ టెంపుల్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికెళ్లి ఓటర్లను కలసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లకు కరపత్రాలను అందజేశారు.
4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి దేవా మాధవరావుకంపౌండ్ , వెంకటేశ్వరకాలనీ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
5వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కుమ్మరి నవనీత నాగసాల, నిమ్మబావిగడ్డ ప్రాంతంలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని చెబుతూ ప్రచారం చేశారు.
6 వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సుంకసారి రమేశ్ హరిజనవాడ, జవహర్నగర్ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
7వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఉమాదేవి బూరెడ్డిపల్లి, శివాలయం వీధి, ఎస్సీ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి దోరేపల్లి లక్ష్మీ హౌసింగ్బోర్డుకాలనీ, ప్రశాంత్నగర్లో విస్త్రతంగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే హౌసింగ్బోర్డుకాలనీ మరింత అభివృద్ధి అవుతుందని ఓటర్లకు వివరించారు.
9వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చైతన్య నక్కలబండతండా, చీకూరిగుడిసె ప్రాంతంలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
10వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నడిమింటి రవి కుమ్మరివాడి, బాలాజీనగర్, సంతోష్నగర్, గాంధీచౌరస్తాలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే వార్డులో మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
11వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బండమీది జ్యోతి బాబానగర్ ప్రాంతంలో ప్రచారం చేశారు. ఇంటింటికెళ్లి ఓటర్లను కలసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
12వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి రఘురాంగౌడ్ శ్రీనివాస్కాలనీలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డులో అన్ని వేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
13వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్గౌడ్ చైతన్యనగర్కాలనీ, వెటర్నరీ దవాఖాన వెనుక ప్రాంతంలో జోరుగా ప్రచారం చేశారు. ఇంటింటికెళ్లి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కరపత్రాలను అందిస్తూ ఓటర్లను కలిశారు.
14వ వార్డులో కోనేటి పుష్పలత త్రిశూల్నగర్, బక్కారావుకంపౌండ్ ఏరియా, హనుమాన్స్ట్రీట్లో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను కోరారు.
15వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సారిక ప్రచారం చేశారు. గుండప్పకంపౌండ్, ఎల్బిస్ట్రీట్, కేపీ స్ట్రీట్, బాబీస్ట్రీట్లో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. జడ్చర్ల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి ఓటర్లకు వివరించారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
16వ వార్డులో స్వాతి రాంమందిర్, శివాజీనగర్, నటరాజ్ స్ట్రీట్లో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే జడ్చర్ల మున్సిపాలిటి అభివృద్ధికి దోహదపడుతుందని, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
17వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చైతన్య వాల్మీకినగర్, శాంతినగర్, దర్గా ప్రాంతంలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గురించి వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
18వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మొఖిద్ ఫజల్బండ అక్బర్ మసీదు, హనుమాన్ టెంపుల్ ఏరియా, మదీనమసీదు ప్రాంతంలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున మిడ్జిల్ మండలానికి చెందిన నాయకులు ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
19వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సాజిదాసుల్తానా ఎర్రసత్యం కాలనీ, ఫజల్బండ ప్రాంతంలో ప్రచారం చేశారు. వార్డులో అభివృద్ది పనుల కోసం టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సినవసరం ఉందని కోరారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికెళ్లి కరపత్రాలను అందజేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున జడ్చర్ల న్యాయవాదులు ప్రచారం చేశారు.
20వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రావణీ మదీనాతులుమ్ పాఠశాల, గంజ్ ఏరియాలో ప్రచారం చేశారు. జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఇంటింటికెళ్లి ప్రచారం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.
21వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వంగూర్ హరిత పాతబజార్ పీర్లమసీదు, హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ప్రాంతం, సింగిల్విండో కార్యాలయం వెనుక ప్రాంతంలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటికెళ్లి ఓటర్లను కోరారు.
22వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కావలి శ్రీశైలమ్మ హరిజనవాడ, పాతబజార్ హనుమాన్ దేవాలయం వెనుక ప్రాంతంలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
23వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఉమాశంకర్గౌడ్ మదీనాకాలనీ, వెంకటపతిరావుకాలనీ, హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ఏరియాలో ప్రచారం చేశారు. మాంసం మార్కెట్ ప్రాంతంలో ప్రచారం చేస్తూ ఓటర్లను కలసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్ టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు.
24వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్రెడ్డి రంగారావుతోట, పద్మావతికాలనీలో ప్రచారం చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, తెలంగాణ సంగీత,నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున కాలనీల్లో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
25వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి లత లక్ష్మీనగర్కాలనీ, ఇందిరానగర్, వికాస్నగర్, జకీనగర్ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.
26వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆలూరి శశికిరణ్ వెంకటేశ్వరకాలనీ, సయ్యద్వాడీ ప్రాంతంలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
27వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్మడియాదయ్య గాంధీనగర్, ఇందిరానగర్ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కరపత్రాలను ఓటర్లకు ఇస్తూ ప్రచారం చేశారు.