హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ను హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి 153 గ్రాముల కొకైన్, 16 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నట్టు హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ అంజిరెడ్డి చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఖైరతాబాద్లోని ఎంఎస్ మక్తాలోని ఓ ఇంటిపై దాడిచేశారు. ఈ దాడిలో డ్రగ్పెడ్లర్ జేమ్స్ మొరిసన్ పట్టుబడ్డాడు. మొరిసన్ గతేడాది ఆగస్టులోనూ డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడి ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చాడు. గోవాలో ఉండే డ్యాడీబాయ్, మైక్ అనే మరో ఇద్దరు నైజీరియన్లు మొరిసన్ను తమ ఏజెంట్గా హైదరాబాద్లో నియమించుకుని అతడి ద్వారా కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. డ్యాడీబాయ్, మైక్ ఇద్దరు పరారీలో ఉన్నారని ఏఈఎస్ అంజిరెడ్డి పేర్కొన్నారు.