అమీర్పేట్, మార్చి 14: అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై పట్టభద్ర ఓటరు తాళ్ల సాయిచంద్రగౌడ్ తెలిపిన ఓ సరదా నిరసన ట్విట్టర్లో వైరల్ అయింది. సాయిచంద్ర సందర్భోచిత నిరసనకు ముగ్ధుడైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అతన్ని అభినందిస్తూ రీట్వీట్ చేశారు. ఆదివారం ఉదయం బల్కంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటువేసేందుకు వెళ్తూ సాయిచంద్ర, అక్కడి పెట్రోల్ పంపులో యంత్రానికి దండం పెట్టాడు. ఆ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేయటంతో వైరల్గా మారింది. సాయిచంద్ర ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే మంత్రి కేటీఆర్, అతన్ని అభినందిస్తూ రీట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, తలసాని సాయికిరణ్ యాదవ్, పలువురు కార్పొరేటర్లు కూడా రీట్వీట్ చేసి అభినందించారు. సామాన్యుల నుంచి కూడా ఈ ట్వీట్లకు విపరీతంగా లైక్లు, షేర్లు వచ్చాయి.