తెలంగాణ : కేంద్ర సాంస్కృతిక, టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా జి.కిషన్రెడ్డి ఈవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు టూరిజం మంత్రిగా, ఉదయం 10 గంటలకు సాంస్కృతికశాఖ మంత్రిగా, ఉదయం 10.30 గంటలకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా ఆయా కార్యాలయాల్లో కిషన్రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్రెడ్డికి ప్రధాని మోదీ జంబో క్యాబినెట్లో ప్రమోషన్ లభించి కేబినెట్ హోదా దక్కిన విషయం తెలసిందే. బుధవారం జరిగిన విస్తరణలో 15 మంది క్యాబినెట్ మంత్రులుగా, మరో 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో కేంద్ర క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 78కి చేరింది.