తాడ్వాయి/ ములుగు రూరల్, జూలై 7 : రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పల్లెలు, పట్టణాల్లో ఊహించని అభివృద్ధి జరుగుతున్నదని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ అన్నారు. బుధవారం ఆయన తాడ్వాయి, ములుగు మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీపీలు గొంది వాణిశ్రీ, గండ్రకోట శ్రీదేవీసుధీర్ యాదవ్, డీపీవో వెంకటయ్యతో పర్యటించారు. తాడ్వాయి, కామారంలో పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. పెంచుతున్న మొక్కల వివరాలను సర్పంచ్ను అడిగి తెలుసుకుని మొక్కలు నాటారు. మేడారంలో వైకుంఠధామం, సెగ్రిగేషన్షెడ్డు, వర్మీ కంపోస్టుషెడ్ ను ప్రారంభించారు. హరితహారంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో రహదారి వెంట మొక్కలు నాటారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కరోనా సమయంలో సేవలు అందించిన జీపీ సిబ్బందిని శాలువాతో సన్మానించారు. స్టాఫ్ నర్సులకు క్వార్టర్స్, మీటింగ్ హాల్, పార్కింగ్ నిర్మించాలని వైద్యాధికారి అవినాశ్ జడ్పీ చైర్మన్ను కోరగా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి బీరెల్లి పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. వే ర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి మొక్కలు ఆరు మొక్కలు పంపిణీ చేయాలని, వాటిని నాటి సంరక్షించేలా చర్యలు చేపట్టాలని జీపీ సిబ్బందికి సూచించారు.
హరితహారం కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా చేయవద్దని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టాలన్నారు. రహదారి వెంట ఇప్పటి వరకు నాటిన మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్న ఏపీవో ప్రసూనపై జడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, సర్పంచులు రేగ కల్యాణి, చిడం బాబురావు, గొంది శ్రీధర్, సిద్దబోయిన సారక్క, గడ్డం అరుణ, జాజ చంద్రం, సునీల్, ఎంపీడీవో సత్యాంజనేయప్రసాద్, సర్పంచ్ నిర్మల, ఎంపీవో హన్మంతరావు, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, ఈవో డ్యాగెల శంకరయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు యునూస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గండ్రకోట సుధీర్, పోరిక గోవింద్నాయక్ ఉన్నారు. అలాగే మల్లంప ల్లి, మహ్మద్గౌస్పల్లి, కాసిందేవిపేట, జగ్గన్నపేట, పత్తిపల్లి, దేవగిరిపట్నం, బండారుపల్లి గ్రామాల్లో సర్పంచులు, ప్రజాప్రతి నిధుల ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించారు. జంగాలపల్లి జాతీయ రహదారి డివైడర్ మధ్యలో సర్పంచ్ అనితారాణి ఆధ్వర్యంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, ఎంపీడీవో శ్రీనివాస్ మొక్కలు నాటారు. మల్లంపల్లిలో వాటరింగ్ డే సందర్భంగా సర్పంచ్ చంద కుమారస్వామి, జీపీ కార్యదర్శి కొండల్రెడ్డి శ్మశాన వాటికలోని మొక్కలకు నీళ్లుపట్టారు. అనంతరం గోరింట, కాగితపు పూల మొక్కలను నాటారు.
వెంకటాపూర్లో..
వెంకటాపూర్ : మండలంలోని రామంజపూర్, పాలంపేట, కేశవపూర్ గ్రామాల్లో పల్లె పకృతి పనులను జడ్పీటీసీ గై రుద్రమదేవి, ఎంపీడీవో శ్రీధర్ పరిశీలించారు. సర్పంచులు తుమ్మేటి రాజిరెడ్డి, డోలి రజిత, కొయ్యడ జయలక్ష్మితో కలిసి మొక్కలు నాటి ట్రీ గార్డులు అమర్చారు. కార్యక్రమంలో ఏపీవో సునీత టెక్నికల్ అసిస్టెంట్ శేఖర్, పంచాయతీ కార్యదర్శులు అనిల్, నిరంజన్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
వెంకటాపురం(నూగూరు)లో..
వెంకటాపురం(నూగూరు) : పల్లె ప్రగతిలో భాగంగా బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ అంటి నాగరాజు, ఆర్ఐ వెంకటేశ్వర్లు, సర్పంచులు చిడెం యామిలి, పూజరిఆదిలక్ష్మి, వాసం సత్యవతి పాల్గొన్నారు.
వార్డుల్లో కొనసాగుతున్న పట్టణ ప్రగతి పనులు
భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్/ కృష్ణకాలనీ : భూపాలపల్లి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. బుధవారం 12వ వార్డులో వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, 15,18, 24 వార్డుల్లో కౌన్సిలర్లు నాగవెళ్లి రాజలింగమూర్తి, నాగుల శిరీషాదేవేందర్రెడ్డి, శిరుప అనిల్కుమార్ రోడ్లవెంట ఉన్న పిచ్చి మొక్కలతో పాటు సైడ్ కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త తొలగింపజేశారు.22వ వార్డు లక్ష్మీనగర్, హనుమాన్నగర్, సుభాష్ కాలనీ, రాంనగర్, గణేశ్చౌక్ ప్రాంతాల్లోని పిచ్చి మొక్కలు, చెత్త, ముళ్ల కంపలను కౌన్సిలర్ ముంజాల రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది తొలగించారు. ఇండ్లలోని నీటి నిల్వలను పారబోశారు. కార్యక్రమంలో డీసీపీవో హరికృష్ణ, జక్కం రవికుమార్, చల్లా రేణుక, వార్డుల ప్రత్యేక అధికారులు రాకేశ్, సామంతుల నిర్మల, అర్బన్ బీసీ సెల్ అధ్యక్షుడు కట్ట నర్సింహచారి, సర్వం సుధాకర్, మున్సిపల్ సిబ్బంది, వార్డు కమిటీల సభ్యులు పాల్గొన్నారు. 6వ వార్డు కృష్ణకాలనీలో కౌన్సిలర్ ఎడ్ల మౌనిక ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. 26వ వార్డులో కౌన్సిలర్ పానుగంటి హరికా శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను డోజర్ సాయంతో శుభ్రం చేయించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ వేములవాడ రాజేశ్వరి, ఆర్పీ సంపూర్ణ, జయ పాల్గొన్నారు.
టేకుమట్లలో..
టేకుమట్ల : మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. పనులను ఎంపీడీవో చండీరాణి పరిశీలించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీవో మాధవి, ఎంపీవో రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
చిట్యాలలో..
చిట్యాల : గ్రామాల రూపురేఖలు మార్చేందుకే ప్రభు త్వం పల్లె ప్రగతిని చేపట్టిందని జడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నా రు. బుధవారం ఆయన నైన్పాకలో మొక్కలు నాటే కార్యక్రమం, మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ, ఎంపీడీవో రవీంద్రనాథ్తో కలిసి కొత్తపేటలో మొక్కల పంపిణీ చేశారు. జడ్పీటీసీ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు నాటి కాపాడాలని సూచించారు. గిద్దెముత్తారంలో సర్పంచ్ పొలవేణ పోషాలు మొక్కలను నాటి పల్లె ప్రగతి పనులపై అవగాహన కల్పించారు. నవాబుపేటలో సర్పంచ్ సాయిసుధ పారిశుధ్య పనులు నిర్వహించి కాలనీల్లో చెత్తను తొలగింపజేశారు.
కార్యక్రమంలో సర్పంచులు తొట్ల లక్ష్మి, గజ్జి రవి, ఎంపీటీసీ కట్టెకోళ్ల రమేశ్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
మహాముత్తారంలో..
మహాముత్తారం : మండల వ్యాప్తంగా నాల్గో విడుత పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలారం, స్తంభంపల్లి పీపీ, యామన్పల్లి, స్తంభంపల్లి పీకే, సింగారం గ్రామాల్లో మండల ప్రత్యేక అధికారి, డీఎల్పీవో సుధీర్కుమార్ పర్యటించి, రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. స్తంభంపల్లి పీకే గ్రామంలో శ్మశాన వాటిక, సెగ్రిగేషన్షెడ్ అడవిలో ఉండడంతో మం డల ప్రత్యేక అధికారి సుధీర్కుమార్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లింగమల్ల శారద, తహసీల్దార్ సతీశ్కుమార్, ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, మండల వ్యవసాయ అధికారి కల్వల సతీశ్కుమార్, సర్పంచులు వేల్పుల సరిత, జాడి రాజయ్య, రత్నం బక్కయ్య, మెడిపల్లి సాంబ, రాజేశ్వరి పాల్గొన్నారు.
పలిమెలలో..
పలిమెల : హరితహరంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రత్యేకాధికారి శశిధర్రెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. మండలకేంద్రంతో పాటు లెంకలగడ్డ, పంకెన, సర్వాయిపేట, దమ్మూరు గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రకాశ్రెడ్డి, తహసీల్దార్ బింగి సాయిబాబు, ఎంపీపీ బుచ్చక్క, సర్పంచులు జవ్వాజి పుష్పలత, జనగామ సమ్మక్క, శ్రీనివాస్, రమాదేవి, చుక్కమ్మ, ప్రత్యేకాధికారులు స్వామి, సాయిరామ్, వినోద్, సౌభాగ్యవతి, పంచాయతీ కార్యదర్శులు వరలక్ష్మి, శ్రీధర్, ప్రభాకర్, మధుకర్రెడ్డి, మదన్, అంగాన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
కాటారంలో..
కాటారం : మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో హరితహారంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో డీఆర్డీఏ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ అంజయ్య హాజరై అవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు నాటారు. అనంతరం కాటారం వైకుంఠధామాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో తప్పక మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎంపీవో మల్లికార్జున్ రెడ్డి, ఎంపీటీసీ తోట జనార్దన్, ఏపీవో లవకుమార్, కార్యదర్శి షగీర్ఖాన్, ప్రిన్సిపాల్ చైతన్య, అనిత పాల్గొన్నారు.