25 వేల మంది రాక
19 లక్షలకు పైగా ఆదాయం
వేములవాడ టౌన్, మార్చి 29: వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 25 వేలమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నా రు. ఉదయం 6గంటల నుంచే ఉచిత, శీఘ్ర దర్శ న క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి 2నుంచి 3 గంటలపాటు సమయం పట్టిందని, కోడెమొక్కు తీర్చుకోవడంకోసం మరోగంట సమయం పట్టిందని భక్తులు అంటున్నారు. ఆలయ కళాభవన్లో 91మంది దంపతులు కల్యాణ మొక్కు లు నిర్వహించుకున్నారు. ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు దాదాపు 19లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
‘మన్ కి బాత్’ లో మన మిథాలికి మోదీ ప్రశంస
పెండ్లిళ్లకు 100 మందికి, చావులకు 50 మందికే అనుమతి..!