హైదరాబాద్ : నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయంగా సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో మరోసారి టికెట్ కేటాయించి విజయానికి అన్నివిధాలా అండగా నిలిచిన సీఎం కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. పల్లా వెంట నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులున్నారు.